News November 11, 2024
కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం: CM

హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Similar News
News July 7, 2025
దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.
News July 7, 2025
రికార్డులు బద్దలుకొట్టిన ముల్డర్

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ క్వాడ్రాపుల్ సెంచరీకి అవకాశమున్నా 367* రన్స్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అయినా పలు రికార్డులు బద్దలుకొట్టారు. విదేశాల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో 350 రన్స్ చేసిన ఏడో ప్లేయర్గా నిలిచారు. ఒక టెస్టులో హయ్యెస్ట్ రన్స్ చేసిన సౌతాఫ్రికన్గా రికార్డు సొంతం చేసుకున్నారు.
News July 7, 2025
ఈనెల 11 నుంచి OTTలోకి కొత్త సినిమా

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్, హనురెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘8 వసంతాలు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈనెల 11 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హేశామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.