News November 11, 2024
కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం: CM

హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Similar News
News January 26, 2026
RD వేడుకలు.. PM మోదీ షేర్ చేసిన అద్భుత చిత్రాలు

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. భారత రక్షణ దళాలు చేసిన విన్యాసాలు, కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనికుల మార్చ్ ఫాస్ట్, గుర్రాలు, ఒంటెలతో తీసిన ర్యాలీలు, వివిధ రాష్ట్రాల శకటాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను ప్రధాని మోదీ ‘X’ వేదికగా పంచుకున్నారు.
News January 26, 2026
అంబేడ్కర్ యూనివర్సిటీలో 53పోస్టులకు నోటిఫికేషన్

ఆగ్రాలోని <
News January 26, 2026
రేపు మధ్వనవమి.. ఎందుకు జరుపుతారంటే?

ద్వైత సిద్ధాంతకర్త, వాయుదేవుని మూడో అవతారమైన మధ్వాచార్యులు భౌతిక దేహంతో బదరీ క్షేత్రానికి పయనమైన పవిత్ర దినమే మధ్వనవమి. మాఘ శుక్ల నవమి నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో శిష్యులకు పాఠం చెబుతుండగా పుష్పవృష్టి కురిసి అదృశ్యమయ్యారు. హరియే సర్వోత్తముడని చాటిచెప్పిన ఆయన స్మరణార్థం నేడు మధ్వనవమి జరుపుకొంటాం. లోకానికి జ్ఞాన, భక్తి మార్గాలను అందించిన మహనీయుని పట్ల కృతజ్ఞతగా ఆయనకు విశేష పూజలు నిర్వహిస్తారు.


