News November 11, 2024
కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం: CM

హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Similar News
News December 28, 2025
లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఉంచాల్సిన వస్తువులివే..

లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలం, తామర గింజలు, గురువింద గింజలు వంటి వస్తువులు లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు ముత్యాలు, రూపాయి కాసులు, చిట్టి గాజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవని అంటున్నారు. ఈ మంగళకరమైన వస్తువులను పూజ గదిలో ఉంచి భక్తితో ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తి తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూచిస్తున్నారు.
News December 28, 2025
లంచ్ తర్వాత రెగ్యులర్గా నిద్ర వస్తుందా? లైట్ తీసుకోవద్దు

లంచ్ తర్వాత తరచూ నిద్రమత్తుగా ఉంటే లైట్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘తరచూ ఈ సంకేతాలు కనిపిస్తే బాడీలో ఇంటర్నల్గా మార్పులు జరుగుతున్నట్టు గుర్తించాలి. లంచ్ తర్వాత శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వాటిని కంట్రోల్ చేయడానికి బాడీ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఇది సాధారణమే అనిపించినా రెగ్యులరైతే టైప్-2 డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు’ అని హెచ్చరిస్తున్నారు.
News December 28, 2025
25,487 కానిస్టేబుల్ పోస్టులు.. 3రోజులే

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్లో CBT ఉంటుంది. మరోవైపు దరఖాస్తుల గడువు పొడిగించబోమని SSC స్పష్టం చేసింది.
Website: <


