News November 11, 2024
కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం: CM

హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Similar News
News January 2, 2026
BRSకు కవిత డెత్ వార్నింగ్!

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో కవిత BRSకు డెత్ వార్నింగ్ ఇచ్చారు. KCR రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్నారు. KCR అసెంబ్లీలో మాట్లాడాలని పార్టీలు, ప్రజలు కోరుతున్న వేళ కూతురూ ఇదే మాట అని పుట్టింటి పార్టీని ఓ విధంగా ఇరకాటంలో పెట్టారు. గులాబీ బాస్పై కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడుతూనే KCR లేకపోతే పార్టీ కథ ముగిసినట్లే అని పరోక్షంగా హెచ్చరించారు. కవిత కామెంట్లతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి.
News January 2, 2026
IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 2, 2026
ముస్తాఫిజుర్ IPLలో ఆడతారా? BCCI రిప్లై ఇదే?

బంగ్లాదేశ్లో హిందువులపై వరుస <<18733577>>దాడుల<<>> నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బంగ్లా ప్లేయర్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని BCCI ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ముస్తాఫిజుర్ను జట్టు నుంచి తొలగించాలని KKR, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.


