News November 5, 2024
రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది.
Similar News
News January 10, 2026
తగ్గని రష్యా.. ఉక్రెయిన్పై మరోసారి మిసైళ్ల దాడి!

అమెరికా దూకుడు, పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడులు చేసింది. వందలాది డ్రోన్లు, డజన్లకొద్దీ మిసైళ్లతో కీవ్పై విరుచుకుపడింది. నలుగురు చనిపోయారని, 25 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. యుద్ధం మొదలయ్యాక రష్యా శక్తిమంతమైన హైపర్సోనిక్ మిసైల్ను ఉపయోగించడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. దీంతో పుతిన్ శాంతిని కోరుకోవడం లేదని యూరోపియన్ నేతలు మండిపడ్డారు.
News January 10, 2026
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలో దుండగుడు జరిపిన ఫైరింగ్లో ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతడు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు చేశాడనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 10, 2026
బంగ్లా-పాక్ మధ్య విమానాలు.. కేంద్రం పర్మిషన్ ఇస్తుందా?

పాక్కు ఈ నెల 29 నుంచి బంగ్లాదేశ్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచే అవి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో బంగ్లా విమానాలకు కేంద్రం పర్మిషన్ ఇస్తుందా అనేది కీలకంగా మారింది. పాక్ విమానాలు మన గగనతలం నుంచి వెళ్లడంపై నిషేధం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే 2,300KM వెళ్లాల్సిన విమానాలు 5,800KM మేర చుట్టేసుకుని పోవాల్సి ఉంటుంది. 3 గంటల జర్నీ కాస్తా 8 గంటలకు పెరగనుంది.


