News December 9, 2024
రేపటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

TG: తమను రెగ్యులర్ చేస్తామని CM రేవంత్ ఇచ్చిన హామీ నెరవేరలేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10నుంచి సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. 20ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమ్మెతో కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు.
Similar News
News November 5, 2025
ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?


