News January 7, 2025
నేటి నుంచి విధుల్లోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

TG: పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. Dy.CM భట్టితో చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. విద్యాశాఖలో విలీనం, పే స్కేల్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.
Similar News
News November 26, 2025
చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారీ ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాజ్కోట్లోని తన నివాసంలో ఉరేసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పబారీపై గతేడాది అత్యాచారం కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉండగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారీ.
News November 26, 2025
చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారీ ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాజ్కోట్లోని తన నివాసంలో ఉరేసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పబారీపై గతేడాది అత్యాచారం కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉండగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారీ.
News November 26, 2025
ముస్లింలు మాకు ఓటు వేయట్లేదు: కేరళ BJP చీఫ్

BJPకి ముస్లింలు ఓట్లు వేయకపోవడం వల్లే క్యాబినెట్లో ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లేదని కేంద్ర మాజీ మంత్రి, కేరళ BJP చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘ముస్లింలు మాకు సపోర్టు చేయకపోతే మేమేం చేయాలి. మా పార్టీలో ఆ కమ్యూనిటీ నుంచి ఒక్క MP కూడా లేరు. అందుకే క్యాబినెట్లో చోటు దక్కలేదు’ అని కోజికోడ్లో చెప్పారు. వారు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు.


