News December 7, 2024
బిహార్లో పోటీ పరీక్షల అభ్యర్థుల ఆందోళన

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల సరళిని మార్చాలని డిమాండ్ చేస్తూ పోటీ పరీక్షల ఆశావహులు ఆందోళనకు దిగారు. Dec 13న BPSC నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షల్లో ఒక పూట ఒకే పేపర్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఖాన్, రెహ్మాన్ ఖాన్ వంటి కొందరు ప్రముఖ విద్యావేత్తలు మద్దతుపలికారు. ఆందోళనకారులపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయడం వివాదాస్పదమైంది.
Similar News
News October 30, 2025
టీమ్ ఇండియాకు బిగ్ షాక్

WWC: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న స్మృతి మంధాన(24) ఔటయ్యారు. తొలుత బంతిని అంపైర్ వైడ్గా ప్రకటించగా, ఆసీస్ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్మృతి అసంతృప్తిగా పెవిలియన్కు వెళ్లారు. అంతకుముందు షెఫాలీ 10 పరుగులకే వెనుదిరిగారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా ఉంది.
News October 30, 2025
2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్లో సంచలన విషయాలు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.
News October 30, 2025
కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.


