News April 5, 2024
పోలవరం, గోపాలపురం టికెట్లపై టీడీపీ శ్రేణుల ఆందోళన

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా) పర్యటనలో గందరగోళం ఏర్పడింది. పోలవరం, గోపాలపురం అసంతృప్త నేతలు, కార్యకర్తలు CBN కాన్వాయ్ను అడ్డుకున్నారు. జనసేన నేత చిర్రి బాలరాజుకు పోలవరం టికెట్ ఇవ్వొద్దని బొరగం శ్రీనివాస్(TDP) వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గోపాలపురంలో మద్దిరాజు వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బాపిరాజు వర్గీయులు నినాదాలు చేశారు.
Similar News
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


