News October 27, 2024

ముగిసిన గ్రూప్-1 మెయిన్స్

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు ఈ నెల 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో 29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

Similar News

News January 3, 2026

‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

image

పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్‌గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.

News January 3, 2026

ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

image

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 3, 2026

వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది: రాజ్‌నాథ్

image

దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉన్నత విద్యావంతులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. <<18265346>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జ్ఞానంతోపాటు విలువలు, వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పారు. విద్య ఉద్దేశం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, కార్యక్టర్‌ను అభివృద్ధి చేసుకోవడమని చెప్పారు.