News October 27, 2024

ముగిసిన గ్రూప్-1 మెయిన్స్

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు ఈ నెల 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో 29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

Similar News

News January 29, 2026

RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>RBI<<>>)కాన్పూర్‌లో 3 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, పీజీ(జనరల్ మెడిసిన్)అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in

News January 29, 2026

KCRకు నోటీసుల్లో దురుద్దేశం లేదు: మహేశ్‌గౌడ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులివ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.

News January 29, 2026

రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/