News July 31, 2024

ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

image

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఉప రాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. నూతన క్రిమినల్ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయం, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తదితర అంశాలపై చర్చిస్తారు.

Similar News

News November 21, 2025

పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

image

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

News November 21, 2025

బెల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

BEL కోట్ద్వారాలో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఆప్షనల్ ట్రేడ్‌కు BBA, BBM, BBS అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, ఆప్షనల్ ట్రేడ్‌కు రూ.12,500 చెల్లిస్తారు.

News November 21, 2025

మహిళల్లో లంగ్ క్యాన్సర్‌ ముప్పు

image

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఆందోళనకరంగా పెరిగిపోతుందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోర్‌, ఔట్‌డోర్‌ వాయుకాలుష్యం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం, చిన్న వయసులోనే మరణించే అవకాశం స్త్రీలలోనే అధికంగా ఉంది. బయో ఇంధనాలు, వంట నుంచి వచ్చే పొగకు ఎక్కువగా గురికావడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు పెరిగిపోతోందని, మహిళలు వాయుకాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది.