News February 2, 2025
కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు

U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.
Similar News
News November 4, 2025
పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు

AP: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల <<17768393>>పని<<>> గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం మొత్తంలో పని గంటలు 48 దాటితే ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ చేశారు. మరోవైపు ఐదు మంది కంటే ఎక్కువ మహిళలుంటేనే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.
News November 4, 2025
నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
News November 4, 2025
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.


