News April 6, 2024
కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

TG: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Similar News
News January 16, 2026
సిద్దిపేట: రైతు బిడ్డకు సీఆర్పీఎఫ్ ఉద్యోగం

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లికి చెందిన రైతు బిడ్డ వోరుగంటి శివాజీ సీఆర్పీఎఫ్ జవానుగా ఎంపికయ్యారు. వోరుగంటి రాజవ్వ-వెంకటయ్య దంపతుల కుమారుడైన శివాజీ.. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ, ట్రాక్టర్ నడుపుకుంటూనే పీజీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి దేశసేవ చేయాలనే లక్ష్యంతో శ్రమించి ఈ ఉద్యోగం సాధించారు. కష్టపడి జవానుగా ఎంపికైన శివాజీని గ్రామ ప్రజలు, స్నేహితులు ఘనంగా అభినందించారు.
News January 16, 2026
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.
News January 16, 2026
ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.


