News November 24, 2024

దేశ రాజకీయాల్లో పరాన్న జీవిగా కాంగ్రెస్: మోదీ

image

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హరియాణాతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఖాళీ అయిందని సెటైర్లు వేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని, అది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమని చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకురాలేదని ప్రధాని స్పష్టం చేశారు.

Similar News

News October 21, 2025

ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులపై ఫిర్యాదు చేయలేదు: ఓలా ప్రతినిధి

image

OLA ఉద్యోగి <<18058963>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు. అరవింద్ మూడున్నరేళ్లుగా తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సమయంలో వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అరవింద్ కుటుంబానికి తక్షణమే అండగా నిలిచేందుకు ఫైనల్ సెటిల్‌మెంట్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేశామని స్పష్టతనిచ్చారు. CEO భవీశ్‌పై నమోదైన కేసును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.

News October 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 21, 2025

సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్‌దీప్

image

ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. SC ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.