News March 30, 2025

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుట్ర: బండి

image

TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Similar News

News April 1, 2025

కాకాణికి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన హైకోర్టు

image

AP: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి ఆయనకు ఉపశమనం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తనపై పోలీసులు <<15956367>>అక్రమ కేసులు<<>> నమోదు చేస్తున్నారని, కేసులు క్వాష్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

News April 1, 2025

HCU భూముల వ్యవహారం: ప్రజాసంఘాలతో భట్టి సమావేశం

image

హెచ్‌సీయూకు సంబంధించి భూముల వ్యవహారంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రజాసంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ సూచన మేరకు భూకేటాయింపులకు సంబంధించిన వివరాలను వారికి ఆయన అందజేశారు. అదే విధంగా రద్దు, చదును ప్రక్రియల గురించి వివరించారు. అంతకు ముందు భూముల వివాదంపై సీఎం మంత్రులతో భేటీ అయి చర్చించారు.

News April 1, 2025

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

image

కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్ ఒడిదుడుకులతో మొదలైంది. ట్రంప్ సుంకాల గడువు రేపటితో ముగియనుండటంతో ఆ భయాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,024 వద్ద ముగియగా నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,165 వద్ద క్లోజ్ అయింది. మీడియా, చమురు, గ్యాస్ స్టాక్స్ తప్పితే దాదాపు మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.

error: Content is protected !!