News April 5, 2025

కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మజ్లిస్ హస్తగతం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే అని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ పదవిని మజ్లిస్ పార్టీకి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, BRS తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఎంఐఎంకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News December 30, 2025

తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది: DGP

image

TG: పోలీస్ వార్షిక నివేదిక-2025ను DGP శివధర్‌రెడ్డి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్‌రేట్‌ 2.33% తగ్గిందని వెల్లడించారు. 2025లో 782 హత్యలు జరిగాయని తెలిపారు. పోలీసులు సేవాభావంతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఈ ఏడాది 509మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా అల్లర్లు లేకుండా నిర్వహించామని, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, మెస్సీ పర్యటన విజయవంతమయ్యాయని వివరించారు.

News December 30, 2025

బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

image

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్, ఇత‌ర గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటిపళ్లు, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవ‌న శైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దిన‌చ‌ర్య‌లో భాగంగా చేసుకోవాలి.

News December 30, 2025

సిరియా కొత్త కరెన్సీ నోట్లను చూశారా?

image

సిరియా ఆర్థిక వ్యవస్థలో భారీ <<14825249>>మార్పులు<<>> చోటుచేసుకున్నాయి. జనవరి 1 నుంచి కొత్త సిరియన్ పౌండ్ నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నోట్లపై ఉన్న బషర్ అల్-అసద్ చిత్రాలను పూర్తిగా తొలగించింది. నోట్లపై గోధుమలు, పత్తి, ఆలివ్స్, ఆరెంజ్ చిహ్నాలను ముద్రించింది. పాత కరెన్సీ విలువ కోల్పోవడంతో ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.