News August 13, 2024

ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

image

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నడుమ ఈ నెల 22న దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టడంతో పాటు సెబీ చీఫ్ మాధబి బుచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలతో సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. అదానీ గ్రూపులో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి

News December 6, 2025

నితీశ్‌ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

image

బిహార్‌ CM నితీశ్‌కుమార్‌ తనయుడు నిశాంత్‌ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News December 6, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in