News October 24, 2024

సైకిల్ గుర్తుపై పోటీ చేయ‌నున్న కాంగ్రెస్ అభ్య‌ర్థులు

image

UPలో 9 అసెంబ్లీ స్థానాల‌ ఉపఎన్నిక‌ల్లో పోటీపై ఇండియా కూట‌మి అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు కూడా స‌మాజ్‌వాదీ పార్టీ ‘సైకిల్’ గుర్తు మీద పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్‌తో చ‌ర్చించాక అఖిలేశ్ యాద‌వ్ వెల్ల‌డించారు. సీట్ల పంప‌కాల కంటే గెలుపే ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. 9 స్థానాల్లో 7 చోట్ల‌ ఎస్పీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.

Similar News

News October 24, 2024

రూ.50 వేల కోట్లతో పనులు: చంద్రబాబు

image

AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News October 24, 2024

తొలి వన్డేలో భారత్ 227 పరుగులకు ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత మహిళల జట్టు 227 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ మంధాన(5) విఫలమయ్యారు. హసబ్నిస్(42), దీప్తి శర్మ(41), యస్తిక(37), షఫాలీ(33) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. న్యూజిలాండ్ టార్గెట్ 228.

News October 24, 2024

INDvsNZ: తొలిరోజు ముగిసిన ఆట

image

భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ ఒక పరుగుకే రోహిత్ వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన అద్భుతమైన బంతికి ఆయన బౌల్డ్ అయ్యారు. మొత్తంగా 11 ఓవర్లు ఆడిన ఇండియా 16 రన్స్‌ చేసింది. గిల్(10), జైస్వాల్(6) క్రీజులో ఉన్నారు.