News April 25, 2024

మోదీ పాలనపై నేడు కాంగ్రెస్ ఛార్జ్‌షీట్

image

TG: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ ఇవాళ ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు. పదేళ్ల మోదీ పాలనలో వైఫల్యాలను అందులో పేర్కొననున్నట్లు సమాచారం. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు.

Similar News

News January 31, 2026

అధికారుల తీరుపై ఏలూరు కలెక్టర్ ఆగ్రహం

image

ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో 281 మంది మహిళలకు అబార్షన్లు జరగడంపై కలెక్టర్ వెట్రి సెల్వి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జరిగిన సమీక్షలో, కేసుల వారీగా పూర్తి వివరాలు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాల వల్లే అబార్షన్లు జరుగుతున్నాయని ఐటీడీఏ పీవో రాములు నాయక్ తెలపగా, కలెక్టర్ ఘాటుగా స్పందించారు.

News January 31, 2026

ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి రేటు రూ.1.28 లక్షలు డౌన్

image

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. <<19006060>>ఫ్యూచర్ ట్రేడింగ్<<>>(మార్చి)లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,28,126 పడిపోయి రూ.2,91,922 పలికింది. అలాగే ఏప్రిల్‌కు సంబంధించి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,50,849కి పడిపోయింది. లైఫ్ టైమ్ హై(రూ.1,80,779)తో పోల్చితే రూ.29,930 తగ్గడం గమనార్హం.

News January 31, 2026

ఇంటి మీద గుడి నీడ పడకూడదా?

image

గుడి నీడ పడే చోట ఇంటి నిర్మాణం చేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటిపై గుడి నీడ పడటం శాస్త్ర సమ్మతం కాదు. దేవాలయ ఆగమశాస్త్రం ప్రకారం దాన్ని మంత్రశక్తితో ప్రతిష్ఠిస్తారు. నిత్య హోమాలు, జపాలతో అక్కడ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. నివాస గృహాల్లో జనన మరణాలు, మైల వంటివి సహజం. ఆ అశౌచం వల్ల గుడి పవిత్రతకు ఆటంకం కలుగుతుంది. ఆ పాపం తగలకూడదు. అందుకే దూరంగా ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>