News January 16, 2025

కి.మీ.కు రూ.3.91 కోట్లు.. సైకిల్ ట్రాక్ పగుళ్లపై కాంగ్రెస్ విమర్శలు

image

హైదరాబాద్‌లోని సైకిల్ ట్రాక్‌పై పగుళ్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గత BRS సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘కాళేశ్వరం, సుంకిశాల.. ఇప్పుడు సైకిల్ ట్రాక్. కేటీఆర్ కట్టించిన సైకిల్ ట్రాక్ పరిస్థితి ఇది’ అని పగుళ్లు వచ్చిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్ గూడ నుంచి ORR ఇంటర్‌ఛేంజ్ వరకు రెండు వైపులా 23 కి.మీ మేర ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. కి.మీకు రూ.3.91 కోట్ల మేర ఖర్చయింది.

Similar News

News November 23, 2025

పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

image

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 23, 2025

నేడు భారత్ బంద్

image

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.

News November 23, 2025

భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

image

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.