News January 5, 2025

నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్: హరీశ్ రావు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రైతుభరోసా ఒక విడతలో ఎకరానికి రూ.7,500 ఇస్తామని, ఇప్పుడు రూ.6,000కు కుదించడం దారుణమన్నారు. ‘రైతుభరోసాను రైతు గుండెకోతగా మార్చారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ఠ. దారుణంగా దగా చేసిన సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసా కూడా చెల్లించాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.

Similar News

News October 22, 2025

ఛోక్సీ కోసం ఆర్థర్ రోడ్ జైలు సిద్ధం!

image

ఆర్థిక నేరస్థుడు మెహుల్ <<18037252>>ఛోక్సీ<<>> కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిద్ధమైంది. బ్యారక్ నం-12లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇందులో 2 రూములు ఉండగా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను అధికారులు బెల్జియం ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. త్వరలోనే ఛోక్సీని భారత్‌కు బెల్జియం అప్పగించే అవకాశం ఉంది. ఇక అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్థర్ రోడ్ జైలులోనే గతంలో 26/11 నిందితుడు అజ్మల్ కసబ్‌ను ఉంచారు.

News October 22, 2025

సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

image

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా నక్షత్రంతో లెక్కించేవారు. ఈ నక్షత్రం పేరు మీదుగానే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. ఈ ఆరు తారలే ఆరు తలలు గల సుబ్రహ్మణ్య స్వామికి తల్లిలా పాలు ఇచ్చాయట. ఈ అనుబంధం వల్లే సుబ్రహ్మణ్య స్వామికి ‘కార్తికేయ’ అనే నామం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక స్టోరీల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 22, 2025

ఆస్తులు పెరిగాయి కానీ.. ఉపాధి తగ్గింది

image

తయారీ రంగంపై ASI ఆసక్తికర అంశాలు వెల్లడించింది. FY24లో మిషనరీ, ల్యాండ్ ఇతర కేపిటల్ వ్యయం 12.6% పెరగ్గా ఉపాధి 7.8%కే పరిమితమైంది. పెరిగిన పోటీ, ఆధునిక సాంకేతికతతో యంత్రాలపై పెట్టుబడి పెరిగినట్లు పేర్కొంది. యంత్ర పరిశ్రమలో 12.9% ఉద్యోగాలు పెరగ్గా 29.7% పెట్టుబడి ఉన్న వస్త్రరంగంలో తగినంత ఉద్యోగ కల్పన కనిపించలేదంది. టెక్నాలజీ అభివృద్ధితో వీటి నిష్పత్తిలో వ్యత్యాసం తప్పదని నిపుణులు అభిప్రాయపడ్డారు.