News January 5, 2025
నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్: హరీశ్ రావు

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రైతుభరోసా ఒక విడతలో ఎకరానికి రూ.7,500 ఇస్తామని, ఇప్పుడు రూ.6,000కు కుదించడం దారుణమన్నారు. ‘రైతుభరోసాను రైతు గుండెకోతగా మార్చారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ఠ. దారుణంగా దగా చేసిన సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్తారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసా కూడా చెల్లించాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.
Similar News
News November 22, 2025
‘వాలంటీర్’పై పెద్దిరెడ్డి కామెంట్స్.. మీరేమంటారు.?

ఇకపై తమ ప్రభుత్వంలో ‘<<18352308>>వాలంటీర్ వ్యవస్థ<<>>’ ఉండదన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సంక్షేమ ఫలాలను అందించే విధంగా జగన్ దీనిని ఏర్పాటు చేశారు. ఓ రకంగా ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ వ్యవస్థ కారణం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. దీంతో 2029లో YCP అధికారం చేపట్టినా వాలంటీర్ వ్యవస్థపై మొగ్గు చూపే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.
News November 22, 2025
మానిటైజేషన్లో SEC, చెన్నై సహా 100 స్టేషన్లు

రైల్వే ఆస్తుల మానిటైజేషన్లో భాగంగా సికింద్రాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ సహ 100 ప్రధాన స్టేషన్ల పరిధిలోని భూమి, కమర్షియల్ స్పేస్ను కేంద్రం లీజుకు ఇస్తుంది. ప్రయివేటు పెట్టుబడులతో సరకు రవాణా రైళ్లను ప్రవేశపెడుతుంది. మానిటైజేషన్ 1.0లో ₹1.5 లక్షల CR వస్తుందని అంచనా వేయగా కేవలం ₹28,717 CR సాధించింది. దీంతో 2.0లో భూమి, కమర్షియల్ స్పేస్పై రైల్వే దృష్టి సారించింది. 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనుంది.
News November 22, 2025
₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్కు చర్యలు

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్లో మానిటైజ్ చేస్తారు.


