News May 4, 2024
వొక్కలిగ ఓట్ల కోసమే ‘ప్రజ్వల్’పై కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు: నిర్మల

కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘ప్రజ్వల్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఏడాదిగా కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వొక్కలిగ ఓట్ల కోసమే ఈ పని చేసింది. ఇప్పుడు లోక్సభ తొలి దశ పోలింగ్ ముగిసే వరకు మౌనంగా ఉంది’ అని ఆరోపించారు. JDSతో పొత్తు ఉన్నప్పటికీ మహిళలపై అరాచకాలను సహించబోమని స్పష్టం చేశారు.
Similar News
News December 20, 2025
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ‘ముస్తాబు’

AP: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాం, బూట్లు ధరించాలి. గోర్లు కత్తిరించుకోవాలి. జుట్టు నీట్గా దువ్వుకోవాలి. టాయిలెట్కు వెళ్లొచ్చాక, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రతి వారం ‘ముస్తాబు స్టార్స్’ పేర్లు ప్రదర్శిస్తారు.
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా?

జున్నులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు A, E, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన తల్లికి, గర్భంలోని శిశువుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ జున్ను పాలను సరిగా ఉడికించకుండా తీసుకుంటే ఇందులోని హానికరమైన బ్యాక్టీరియాల వల్ల గర్భిణికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 20, 2025
ఎప్స్టీన్ ఫైల్స్.. వేలాది ఫొటోలు ఎలా, ఎక్కడ చూడాలి?

అమెరికా లైంగిక నేరగాడు ఎప్స్టీన్కు సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు, ఫొటోలను US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేస్తోంది. వీటిని <


