News June 27, 2024

TPCC చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

image

TPCC చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. మరికాసేపట్లో డిప్యూటీ CM భట్టి హస్తినకు పయనం కానున్నారు. ఇవాళ రాత్రి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, మున్షీ, భట్టి భేటీ కానున్నారు. PCC చీఫ్ ఆశావహులపై చర్చించనున్నారు. కాగా జీవన్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, మహేశ్ కుమార్ పదవి కోసం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News April 8, 2026

‘ధురంధర్-2’ సక్సెస్‌పై మౌనం వీడిన దీపిక

image

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె పోస్ట్ పెట్టలేదంటూ SMలో చర్చ మొదలైంది. దీనిపై ఆమె తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ‘మీకంటే ముందే నేను సినిమా చూశా. SMలో పెట్టనంత మాత్రాన సపోర్ట్ చేయనట్లా?’ అని కౌంటర్ ఇచ్చారు. రణ్‌వీర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె అనవసర విమర్శలకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు.

News April 8, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

image

ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.3,980 పెరిగి రూ.1,53,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 ఎగబాకి రూ.1,41,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.

News April 8, 2026

ఈ యుద్ధంలో నిజంగా ఓడింది సామాన్యుడే!

image

సీజ్‌ఫైర్‌ను US, ఇరాన్ రెండూ తమ విజయంగా చెప్పుకొన్నాయి. లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించుకున్నాయి. కానీ 38 రోజుల ఈ యుద్ధంలో నిజంగా ఓడింది మాత్రం సామాన్యుడే. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. చాలా దేశాలు ఎకనామిక్ క్రైసిస్‌లో చిక్కుకున్నాయి. పరువు కోసం ఇరాన్, US గెలుపు పాటలు పాడుతున్నా.. ప్రపంచం మాత్రం ఆ భారాన్ని ఇంకా మోయాల్సిందే.