News February 23, 2025
కాంగ్రెస్కు దక్కేది గుండు సున్నానే: కిషన్రెడ్డి

TG: రాష్ట్రంలో బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. విద్యావంతులు, టీచర్లను మోసం చేశాయి కాబట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పూర్తి స్థానాల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు.
Similar News
News February 23, 2025
‘భారత్ ఓడిపోతుంది’ అన్న ఐఐటీ బాబా ఎక్కడ?

పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని <<15548119>>జోస్యం చెప్పిన<<>> ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. Xలో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.
News February 23, 2025
ఇది అత్యంత దారుణం: YS జగన్

AP: గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి చివరకు నట్టేటా ముంచారని CM చంద్రబాబును YS జగన్ విమర్శించారు. ‘అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం చూపిస్తానని పరీక్షకు 2 రోజులముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేశారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినా APPSC ముందుకు వెళ్తోందని CM వాయిస్తో ఆడియో లీక్ చేయించి డ్రామా చేశారు. అయోమయం, అస్పష్టత మధ్యే పరీక్షలు నిర్వహించడం అత్యంత దారుణం’ అని <
News February 23, 2025
అసెంబ్లీలో వైసీపీ భాష వాడొద్దు: పవన్

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామన్నారు. ప్రజాగొంతును అసెంబ్లీలో వినిపిద్దామని, సభ్యులు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని సూచించారు. వాడే భాష హుందాగా ఉండాలని, వైసీపీ భాష వాడవద్దని హితవు పలికారు.