News January 11, 2025

ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది: KCR

image

TG: ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని BRS నేతలకు KCR సూచించారు. నిన్న KTR, పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ గురించి ఆయనకు KTR వివరించారు. ‘అధికారం చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. సంక్రాంతి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి/మార్చిలో బహిరంగ సభ నిర్వహిద్దాం’ అని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Similar News

News November 23, 2025

మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

image

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.

News November 23, 2025

తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

image

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

News November 23, 2025

పొల్యూషన్​ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

image

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.