News September 14, 2024
ప్రజల ఆశీస్సులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది: భట్టి

TG: రుణమాఫీపై BRS నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని Dy.CM భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ధర్మారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినవారికి గౌరవం ఇవ్వాలన్నారు. అందుకే రూ.18 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
Similar News
News July 9, 2025
32.39 కోట్ల మంది ఖాతాల్లో PF వడ్డీ జమ

EPFO ఖాతాల్లో 2024-25 సంవత్సరానికి 8.25శాతం <<16951029>>వడ్డీని <<>>కేంద్రం జమ చేస్తోంది. 33.56 కోట్ల మంది సభ్యులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ ముగిసినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. మిగతా వారికి కూడా ఈ వారంలోనే జమ చేస్తామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య వడ్డీ జమ జరగ్గా, ఈ సారి జులైలోనే పూర్తికానుంది. మీ PF ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందా?
News July 9, 2025
రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.
News July 9, 2025
దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్లో<<>> పర్యటించారు.