News September 12, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది: కేటీఆర్

TG: రుణమాఫీ కాలేదని, పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని KTR అన్నారు. ‘KCR రైతును రాజును చేస్తే, కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా బోగస్. రుణమాఫీలో పావు శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. రైతన్నలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


