News May 2, 2024
ఏ పార్టీ చేయనిది ఇప్పుడు కాంగ్రెస్ చేసింది: సీఎం రేవంత్

TG: గోండులు, లంబాడాల హక్కులను BJP, BRS కాపాడలేదని CM రేవంత్ అన్నారు. ఆసిఫాబాద్లో మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఆదిలాబాద్ MP టికెట్ను ఏ పార్టీ మహిళలకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇప్పుడు తొలిసారిగా ఓ మహిళకు ఇచ్చింది’ అని తెలిపారు. పోడు భూముల సమస్యలపై KCR దృష్టి పెట్టలేదని, ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి BJP కృషి చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు స్థానం ఇవ్వలేదని గుర్తుచేశారు.
Similar News
News March 4, 2026
ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
News March 4, 2026
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. పరీక్ష ప్రైమరీ కీ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 MTS, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించిన (CBIC & CBN) పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్షీట్ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే రూ.50 చెల్లించి, మార్చి 6 వరకు తెలుపవచ్చు. వెబ్సైట్: https://ssc.gov.in
News March 4, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అరియర్లపై గుడ్న్యూస్

AP: డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించడంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నెల రోజుల్లో ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు ప్రభుత్వం 2018 జులై నుంచి DA అరియర్లు చెల్లించగా, పలు కారణాలతో చాలా మందికి అవి అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించే వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.


