News March 9, 2025

గ్రాడ్యుయేట్ MLC ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

image

TG: KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఓటమికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి కృషి చేస్తున్నా ఓడిపోవడం సరికాదు. దీని వల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఓటమిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి’ అని ఆదేశించినట్లు సమాచారం.

Similar News

News March 9, 2025

ప్రయాగ్‌రాజ్‌లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

image

కోటానుకోట్ల మంది ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్‌లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

News March 9, 2025

రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.

News March 9, 2025

జడేజా రిటైర్మెంట్?

image

స్టార్ ఆల్‌రౌండర్ జడేజా CT ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా మ్యాచ్‌లో జడ్డూ స్పెల్ తర్వాత ఆయన్ను విరాట్ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించారు. దీంతో ఇప్పటికే T20ల నుంచి తప్పుకున్న జడేజా వన్డే‌ల నుంచీ రిటైర్ అవుతారని తెలుస్తోంది. ఇటీవల అశ్విన్, స్మిత్‌ను హగ్ చేసుకున్న తర్వాత వారు రిటైర్ అయ్యారు. అలాగే జడేజా సైతం అస్త్ర సన్యాసం చేస్తారని ఫ్యాన్స్ పోల్చుతున్నారు.

error: Content is protected !!