News March 20, 2024
అమేథీలో కాంగ్రెస్కు ’21’ గండం తొలగినట్టేనా?
2019 ఎన్నికల్లో కంచుకోట అనుకున్న అమేథీలో ఓటమి కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. ’21’ గండం వల్లే ఇలా జరిగిందని ఈసారి గెలుపు పక్కా అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఈ 21 సంఖ్య కాంగ్రెస్కు కలిసిరావట్లేదట. 1977లో తొలిసారి అమేథీలో ఓడిపోగా మళ్లీ 21 ఏళ్లకు 1998లో ఓటమిపాలైంది. 21ఏళ్ల తర్వాత మళ్లీ 2019లో ఓడింది. మరోవైపు రాజీవ్ గాంధీ చనిపోయిన తేదీ మే 21 కావడం, అప్పుడు రాహుల్ వయస్సు 21 ఏళ్లు కావడం గమనార్హం.
Similar News
News October 1, 2024
డిసెంబర్ 25న ‘గేమ్ ఛేంజర్’ విడుదల: దిల్ రాజు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ‘రా మచ్చా మచ్చా’ ఈవెంట్లో ఆయన ప్రకటించారు. అయితే, గతంలో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండటంతో క్రిస్మస్కి ప్లాన్ చేశారు. కాగా, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది.
News October 1, 2024
లడ్డూ వివాదం.. నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు
AP: తిరుమల లడ్డూ అంశంలో CM చంద్రబాబు, ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు TDP కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు, న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తుడని, ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది.
News October 1, 2024
DSC ఫలితాల్లో తండ్రీకొడుకులకు ర్యాంకులు
TG: డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు. తెలుగు పండిట్గా జిల్లాలో గోపాల్కు ఫస్ట్ ర్యాంక్ రాగా, మ్యాథ్స్ సబ్జెక్టులో భాను ప్రకాశ్కు 9వ ర్యాంక్ వచ్చింది. గోపాల్ భార్య విజయలక్ష్మి ఇదివరకే తెలుగు పండిట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వారి రెండో కుమారుడు చంద్రకాంత్ కూడా గవర్నమెంట్ జాబ్కు(ఏఈఈ) సెలక్ట్ అయ్యాడు.