News October 13, 2024

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్

image

TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.

Similar News

News December 8, 2025

ఉప సర్పంచ్ పదవికి డిమాండ్!

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. సర్పంచ్‌తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండటమే దీనికి కారణం. రిజర్వేషన్లు కలిసిరానిచోట వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్‌ అవ్వాలని పోటీ పడుతున్నారు. దీనికోసం రూ.లక్షల్లో ఖర్చుకు వెనుకాడట్లేదు. ఎస్సీ, ఎస్టీతో జనరల్ రిజర్వేషన్ ఉన్న స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అటు ఇతర వార్డు మెంబర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

News December 8, 2025

పచ్చిరొట్టగా పెసర/మినుముతో లాభాలు

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.

News December 8, 2025

‘అఖండ-2’ విడుదలపై క్లారిటీ అప్పుడే?

image

‘అఖండ-2’ను ఈ నెల 12న విడుదల చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే డిసెంబర్ 25కు రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 12న విడుదలైతే వచ్చే వారంలో ‘అవతార్-3’ రిలీజ్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈరోస్ సంస్థతో వివాదం విషయమై రేపు క్లారిటీ రానుందని, ఆ తర్వాతే రిలీజ్ డేట్‌పై ప్రకటన వస్తుందని వెల్లడించాయి.