News September 17, 2024
కాంగ్రెస్ కూడా బ్రిటిష్ వాళ్లలానే: మోదీ

బ్రిటిష్ పాలకులకు, కాంగ్రెస్కు మధ్య పోలికలున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భువనేశ్వర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మన దేశ స్వాతంత్య్రంలో గణేశ్ ఉత్సవం ముఖ్యపాత్ర పోషించింది. విభజించి పాలించే బ్రిటిష్ వారు అప్పట్లో గణేశ్ ఉత్సవాలపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ విగ్రహాన్ని కటకటాల వెనుక ఉంచారు. ఇది బాధించింది. ఇలాంటివి జరగనివ్వకూడదు’ అని అన్నారు.
Similar News
News October 29, 2025
రష్యా దూకుడు.. ఈ సారి అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగం

అణుశక్తితో నడిచే మరో ఆయుధాన్ని రష్యా ప్రయోగించింది. అండర్ వాటర్ డ్రోన్ ‘Poseidon’ను టెస్ట్ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది న్యూక్లియర్ పవర్ యూనిట్ అమర్చిన మానవరహిత వెహికల్ అని తెలిపారు. ఆ డ్రోన్ను ఇంటర్సెప్ట్ చేసే మార్గమే లేదని చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రష్యా నిర్వహించిన రెండో పరీక్ష ఇది. ఇటీవల న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ <<18109096>>మిసైల్ <<>>Burevestnikను ప్రయోగించడం తెలిసిందే.
News October 29, 2025
‘బ్రేకప్ అయింది సర్.. లీవ్ కావాలి’

లీవ్ కోసం ఓ ఉద్యోగి తన బాస్కు పంపిన రిక్వెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇటీవలే నాకు బ్రేకప్ అయింది. పనిపై దృష్టి పెట్టలేకపోతున్నా. నాకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు సెలవు కావాలి’ అని ఎంప్లాయ్ పెట్టిన మెయిల్ను ‘Knot Dating’ సంస్థ CEO జస్వీర్ సింగ్ షేర్ చేశారు. అత్యంత నిజాయతీగా అడగడంతో వెంటనే లీవ్ ఇచ్చానని పేర్కొన్నారు. దీనికి లైకులు, కామెంట్లు పోటెత్తుతున్నాయి.
News October 29, 2025
ఏపీలో ఆ జిల్లాల్లో సెలవులు.. కాకినాడలో రద్దు

తుఫాను క్రమంగా బలహీనపడటంతో ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు రద్దు చేశారు. ఈ నెల 31వరకు సెలవులు ఇవ్వగా పరిస్థితి అదుపులోకి రావడంతో విద్యార్థులు రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశించారు. అటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, కాలేజీలు ఉంటాయని స్పష్టం చేశారు.


