News March 8, 2025
ఉన్నత పదవులను మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్: రేవంత్

దేశ రాజకీయాలలో రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ లాంటి ఉన్నత పదవులను మహిళలకు కట్టబెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుతో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో సీఎం ప్రసంగించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఉచిత బస్సుతో పాటు మరెన్నో పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
Similar News
News March 28, 2026
విశాఖ పోర్టుకు భారీ LPG నౌక

విశాఖపట్నం పోర్టుకు BW Birch అనే భారీ LPG నౌక చేరుకుంది. సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సామర్థ్యంతో వచ్చిన ఈ నౌక ప్రస్తుతం అన్లోడింగ్ ప్రక్రియలో ఉంది. స్థానిక ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ సరకు అత్యంత కీలకం కానుంది. పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో గ్యాస్ను సేఫ్గా నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశంలోని ప్రధాన ట్రాన్స్షిప్మెంట్ కేంద్రాల ద్వారా ఈ భారీ నౌక విశాఖకు చేరుకోవడం విశేషం.
News March 28, 2026
ఏ వయసు వారు ఎంత సేపు నడవాలి?

ఫిట్గా ఉండటానికి నడక ఒక ఈజీ మార్గం. వయసును బట్టి ఎంత సేపు నడవాలో డాక్టర్లు చెప్పారు. 5-12 ఏళ్ల పిల్లలు రోజుకు 60 నిమిషాలు, టీనేజర్లు 45-60 నిమిషాలు నడవాలి. 20-40 ఏళ్ల వారు 30-45 నిమిషాలు, మిడిల్ ఏజ్ వారు 30-40 నిమిషాలు వాకింగ్ చేస్తే BP కంట్రోల్లో ఉంటుంది. 60 దాటిన వారు రోజుకు 20-30 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇలా రెగ్యులర్గా నడిస్తే బాడీతో పాటు బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది.
News March 28, 2026
లిల్లీ మొక్కల్లో ఆకుమచ్చ తెగులు – నివారణ

లిల్లీ సాగులో ఆకుమచ్చ తెగులు శిలీంధ్రాల వల్ల వస్తుంది. దీని వల్ల ఆకులపై నీటిలో నానినట్లు ఉండే మచ్చలు చిన్న చిన్నవిగా ఏర్పడి, అవి క్రమంగా గోధుమ రంగులోకి మారతాయి. తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోయి మొక్క మొత్తం మాడిపోయినట్లు కనిపిస్తుంది. పూల దిగుబడి పడిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి.


