News April 5, 2024
CONGRESS: మేనిఫెస్టోలో చెప్పింది.. పాటిస్తారా?

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఎమ్మెల్యేల అనర్హత అంశం చర్చనీయాంశంగా మారింది. గెలిచిన పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీల్లో చేరే వారి అసెంబ్లీ/పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో మార్పులు చేస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణలో ఇటీవల ఎన్నికల్లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది.
Similar News
News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ స్నేహ

హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ధర్మసాగర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు, ట్రక్కుల రవాణా, ఓపీఎంఎస్ ఎంట్రీల వివరాలను సమీక్షించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, వారి ఖాతాల్లో డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


