News June 6, 2024

ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేత ఆవేదన

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాబోయే కాలమంతా తనకు గడ్డు కాలమేనని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తప్ప ఇతర విషయాల్లో తనకు అవగాహన లేదని మీడియాతో చెప్పారు. కుటుంబ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోలేదని, కష్టాలను ఎలా అధిగమించాలో తెలియడం లేదన్నారు. కాగా బెంగాల్‌లోని బర్హంపూర్ నియోజకవర్గంలో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ ఓడిపోయారు.

Similar News

News October 6, 2024

ఇష్టమైన రంగు ద్వారా మీ పర్సనాలిటీ తెలుసుకోండి?

image

ఎరుపు రంగును ఇష్టపడేవారు దృఢంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. బ్రౌన్ కలర్ ఇష్టమైన వారికి స్థిరత్వం, నమ్మకంగా ఉంటారు. గులాబీ రంగు ఇష్టపడేవారు అందరినీ సంతోషంగా ఉంచుతారు. ఆకుపచ్చ ఇష్టపడేవారు ప్రశాంతంగా ఉంటారు. పసుపు రంగు ఇష్టపడేవారు క్రియేటివ్‌గా ఉంటారు. తెలుపు ఇష్టపడేవారు స్వచ్ఛంగా ఉంటారు. నీలం రంగు ఇష్టపడేవారు సాదాసీదాగా ఉంటారు. నారింజ రంగు వారు ఏకాగ్రతతో ఉంటారు. నలుపును ఇష్టపడేవారు ఎవ్వరికీ అర్థం కారు.

News October 6, 2024

జనసంద్రమైన మెరీనా బీచ్(PHOTOS)

image

చెన్నైలో ఎయిర్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో లక్షలాది మంది ఎయిర్‌షోను చూసేందుకు తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ అంతా జనసంద్రమైంది. బీచ్‌కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఈక్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.

News October 6, 2024

పాక్‌పై మరోసారి ఆధిపత్యం చాటిన భారత్

image

భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించింది. ఇరు జట్లు ఇప్పటివరకు మెగా టోర్నీల్లో 8 సార్లు తలపడి భారత్ 6 సార్లు గెలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా దాయాదుల మధ్య 16 టీ20 మ్యాచులు జరగ్గా 13 భారత్, 3 పాక్ గెలిచింది.