News April 15, 2025
నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

TG: రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం ఇవాళ ఉ.11గంటలకు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో పాటు భూభారతి, SC వర్గీకరణ, BCలకు 42శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రజాప్రతినిధులకు CM దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న వివాదాలు, పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చించే అవకాశముంది.
Similar News
News April 16, 2025
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకుండాలి?: సుప్రీం

వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించేలా వక్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన సవరణను సుప్రీం కోర్టు ఆక్షేపించింది. ‘హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా? అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి?’ అని ప్రశ్నించింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకస్తూ వచ్చిన పిటిషన్లను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం<<16118368>> ఈరోజు విచారించిన సంగతి తెలిసిందే.<<>>
News April 16, 2025
రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

AP రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి CRDA టెండర్లను ఆహ్వానించింది. 1,2 టవర్ల నిర్మాణానికి రూ.1,897కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1,664 కోట్లతో టెండర్లను పిలిచింది. వీటితో పాటు HOD ఆఫీసుకు రూ.1,126 కోట్లతో అదనంగా మరో టవర్ నిర్మాణానికీ టెండర్లను పిలిచింది. అటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
News April 16, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించలేం: సుప్రీం

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.