News August 20, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ MP శశిథరూర్ మద్దతు

నేరం చేస్తే పీఎం, సీఎం, మంత్రులకు ఉద్వాసన పలికేలా కేంద్రం రూపొందించిన బిల్లుకు ప్రతిపక్ష ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. ఆ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సీఎంలను అన్యాయంగా అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. అయితే అందుకు భిన్నంగా శశి థరూర్ స్పందిస్తూ ఆ బిల్లుల్లో లోపమేమీ లేదని అభిప్రాయపడ్డారు.
Similar News
News August 20, 2025
అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం

ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఒడిశా చందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మిస్సైల్ను పరీక్షించారు. ఈ లాంఛ్ అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్ను రీచ్ అయినట్లు పేర్కొంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇది ఇండియన్ ఆర్మీకి బిగ్గెస్ట్ అసెట్ కానుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News August 20, 2025
సినీ రంగంలోనూ AI ప్రభావం.. నటీనటులకు గడ్డుకాలమేనా?

ఉద్యోగుల్లో భయాన్ని రేకెత్తిస్తోన్న AI ఇప్పుడు సినీ ఫీల్డ్నూ తాకింది. ఇప్పటికే పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నటీనటులు లేకపోయినా భావోద్వేగాలను సృష్టించొచ్చు అని ఇది నిరూపించింది. ఈక్రమంలో ఏఐతో సినిమాలు తీయడంపై బాలీవుడ్ దృష్టి పెడుతోంది. రామాయణ్, చిరంజీవి హనుమాన్ వంటి చిత్రాలను ఏఐతో రూపొందిస్తోంది. దీనిపై మీ కామెంట్?
News August 20, 2025
సౌదీలో స్కై స్టేడియం

FIFA వరల్డ్ కప్-2034 వేళ సౌదీ అరేబియా వినూత్న స్టేడియాన్ని నిర్మించనుంది. సౌదీ నిర్మించబోయే స్మార్ట్ సిటీలో ఇది ఏర్పాటుకానుంది. ది లైన్ అనే స్మార్ట్ సిటీలో ఎడారి తలానికి 350M ఎత్తులో నిర్మించనున్నారు. 46వేల మంది ప్రేక్షకులు కూర్చొనేలా దీనిని రూపొందించనున్నారు. ఇందుకు $1 బిలియన్ను ఖర్చు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2027లో ప్రారంభించి 2032 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.