News December 28, 2024
కాంగ్రెస్ ఎన్నడూ మన్మోహన్ సింగ్ను గౌరవించలేదు: BJP నేత

మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని BJP నేత సుధాంశు త్రివేది ఆరోపించారు. బతికున్నప్పుడు వాళ్లెప్పుడూ ఆయన్ను గౌరవించలేదని విమర్శించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు. మోదీ ప్రభుత్వం ప్రణబ్, మాలవీయ, PVని భారతరత్నతో గౌరవించింది. కాంగ్రెస్లో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు కాకుండా పదేళ్లు ప్రధానిగా చేసింది మన్మోహన్ ఒక్కరే. పటేల్, శాస్త్రి, పీవీని వాళ్లు అవమానించారు’ అని వివరించారు.
Similar News
News September 24, 2025
ఇవాళ తిరుమలకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి CBN దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ సా.6.20 గంటలకి తిరుమల చేరుకుంటారు. రా.7.40 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. రేపు ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం విజయవాడకు బయల్దేరుతారు.
News September 24, 2025
ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 24, 2025
బతుకమ్మకుంట: హైడ్రా కమిషనర్ బోటులో షికారు

TG: హైదరాబాద్లోని అంబర్పేట్లో <<16988578>>హైడ్రా<<>> పునరుద్ధరించిన బతుకమ్మకుంటలో కమిషనర్ రంగనాథ్ బోటులో షికారుకెళ్లారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును వీహెచ్ ప్రశంసించారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ఈ కుంటను నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు.