News May 11, 2024
YSR పేరును సీబీఐ ఛార్జిషీట్లో కాంగ్రెస్ చేర్చలేదు: రాహుల్

AP: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కడప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజన సమయంలో APకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాం. CBI ఛార్జిషీటులో YSR పేరుని కాంగ్రెస్ చేర్చలేదు. కొందరు స్వలాభం కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు. YSR సిద్ధాంతాలు పార్లమెంట్లో వినిపించాలంటే షర్మిలను గెలిపించాలి’ అని కోరారు.
Similar News
News November 15, 2025
ICMRలో 28 పోస్టులు

<
News November 15, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ
News November 15, 2025
మరో కీలక మావో లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.


