News September 30, 2024

కాంగ్రెస్ వాళ్లు అటు వైపు వెళ్లకండి: KTR

image

TG: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇళ్లు కట్టిస్తామని చెప్పింది కానీ కూలుస్తామని ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ నేతలను జీవితంలో ఎన్నడూ విననన్ని బూతులు తిడుతున్నారు. దయచేసి మీరు బాధితుల ఇళ్ల వైపు వెళ్లకండి. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు. మీకు ఇదే నా సూచన. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లలోకి కూడా వెళ్లలేరు’ అని అన్నారు.

Similar News

News September 30, 2024

నిజం తెలిసి దాచి ఉంటే అది నిజమైన పాపం: TDP

image

AP: తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీపడదు, రాజకీయం చేయదని TDP ట్వీట్ చేసింది. ‘నెయ్యి కల్తీ జరిగిందని NDDB లాంటి పేరున్న సంస్థ రిపోర్ట్ చూడగానే CM ప్రజల ముందు ఉంచారు. నిజం తెలిసి దాచి ఉంచితే అది నిజమైన పాపం. వాస్తవాలు తేల్చడానికే సిట్ ఏర్పాటు చేశారు. అనేక చర్యలతో ప్రజల్లో అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లడ్డూ నాణ్యతలో మార్పు వచ్చిందని ప్రజలు అంటున్నారు’ అని పేర్కొంది.

News September 30, 2024

గ్రాడ్యుయేట్ MLC ఓట్ల నమోదుకు నోటిఫికేషన్

image

AP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల (గ్రాడ్యుయేట్) పట్టభద్రుల స్థానం పరిధిలో ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఫారం 18 ద్వారా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న MLC ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

News September 30, 2024

సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు

image

ముడా కేసులో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్దరామ‌య్య‌ సహా పలువురిపై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించినా సిద్దరామ‌య్య‌కు ఊర‌ట ద‌క్కలేదు. దీంతో లోకాయుక్తలో ఆయనపై FIR నమోదైన విషయం తెలిసిందే. మైసూరు అర్బ‌న్ డెవ‌లప్మెంట్ అథారిటీలో సీఎం సతీమణికి భూకేటాయింపులపై వివాదం చెలరేగింది.