News August 22, 2024
నేడు ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన

TG: అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని, సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో కాంగ్రెస్ హైకమాండ్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసు వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నిరసనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
Similar News
News January 19, 2026
పోలాండ్ మంత్రికి ముఖం మీదే ఇచ్చిపడేసిన జైశంకర్!

పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోలాండ్ జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని, భారత్ పొరుగు దేశాల్లో (పరోక్షంగా పాక్లో) ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని గట్టిగా చెప్పారు. గత ఏడాది పాక్ పర్యటనకు వెళ్లిన సికోర్స్కీ కశ్మీర్పై పాక్ వాదానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జైశంకర్ నేరుగా చురకలంటించారు.
News January 19, 2026
భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

బడ్జెట్ 2026లో మ్యారీడ్ కపుల్ కోసం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే ఆర్థిక యూనిట్గా పరిగణించి ఉమ్మడి ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. ఈ విధానం వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకే ITR ఫైల్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, సింగిల్ ఇన్కమ్ కుటుంబాలకు భారీ ఊరటనిస్తుంది.
News January 19, 2026
6 గంటలకుపైగా విజయ్ను విచారించిన సీబీఐ

కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ దళపతిని సీబీఐ రెండోసారి విచారించింది. సుమారు 6 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ నెల 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. అయితే ఆరోజు ఆయనను సాక్షిగా ప్రశ్నించగా, ఇవాళ అనుమానితుడిగా ఇంటరాగేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.


