News March 15, 2025

కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: కేటీఆర్

image

కాంగ్రెస్ పాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు. పీరు లేచింది లేదు. రూ.1.50 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతుభరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ’ అని పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

ఏలూరు రూరల్ మండలం పెనుమాక లంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47) మాదేపల్లి గంగానమ్మ గుడి వద్ద శనివారం మృతి చెందాడు. కూలి పనులు చేసుకునే వెంకన్న కూలి పనిలో వచ్చిన సొమ్ముతో మద్యం తాగి రోడ్డు పక్కనే నిద్రించేవాడు. శనివారం రోడ్డు పక్కనే అతను మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో మృతిచెందాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

News December 1, 2025

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

image

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్‌ విధించనున్నట్లు సమాచారం.

News December 1, 2025

ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

image

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.