News March 15, 2025
కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు. పీరు లేచింది లేదు. రూ.1.50 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతుభరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ’ అని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
ఆ హీరో కోసమే ప్రత్యేక పాటలో డాన్స్ వేశాను: గుత్తా జ్వాల

హీరో నితిన్ కోసమే తాను ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ప్రత్యేక గీతం చేశానని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఆ సినిమా కంటే ముందు నాకు చాలా సినిమా ఛాన్సులు వచ్చినా ఒప్పుకోలేదు. నితిన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని అడిగాడు. నాకు ఆసక్తి లేకపోయినా తన ఒత్తిడి వల్లే ఆ సాంగ్ చేశాను. ఆ పాట తన సినిమాకు హెల్ప్ అయింది’ అని గుర్తుచేసుకున్నారు.
News March 15, 2025
BRS హయాంలో కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి

TG: KCR, హరీశ్ రావు, KTR సొంత నియోజకవర్గాల్లో BRS హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేల్లో అప్పట్లో రూ.104 కోట్ల రుణమాఫీ జరిగితే ఇప్పుడు రూ.237 కోట్లు, సిద్దిపేటలో గతంలో రూ.96 కోట్ల మాఫీ అయితే తమ పాలనలో రూ.177 కోట్లు, సిరిసిల్లలో అప్పుడు రూ.101 కోట్లు మాఫీ చేస్తే తాము రూ.175 కోట్ల మాఫీ చేసినట్లు వెల్లడించారు.
News March 15, 2025
ప్రకాశ్ రాజ్కు బండ్ల గణేశ్ కౌంటర్?

AP: సినీ నిర్మాత బండ్ల గణేశ్ Xలో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది నటుడు ప్రకాశ్ రాజ్కు కౌంటర్గానే ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి’ అని రాసుకొచ్చారు. కాగా నిన్న డిప్యూటీ సీఎం <<15764256>>పవన్ కళ్యాణ్<<>>పై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.