News March 15, 2025

కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: కేటీఆర్

image

కాంగ్రెస్ పాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు. పీరు లేచింది లేదు. రూ.1.50 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతుభరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ’ అని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2025

జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?

image

నిన్న పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, గోద్రా మారణహోమంపై జనసేనాని మాట్లాడారు. తాను మహారాష్ట్ర, హరియాణాకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్నారు. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?

News March 15, 2025

ALERT: ఇవాళే లాస్ట్‌డేట్ లేదంటే పెనాల్టీ..

image

FY24-25కి గాను అడ్వాన్స్ ట్యాక్స్ ఆఖరి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించేందుకు MAR 15 చివరి తేదీ. IT చట్టం ప్రకారం ఒక FYలో అంచనా వేసిన పన్ను రూ.10,000 దాటితే ముందస్తుగా చెల్లించాలి. ఉద్యోగులకైతే కంపెనీలు TDS/TCS కత్తిరిస్తాయి. కొందరికి FD, MF, షేర్లు, ఇతర పెట్టుబడుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. వారు JUNE, SEP, DEC, MAR 15లోపు 4 విడతల్లో 15, 45, 75, 100%లోపు పన్ను చెల్లించాలి. లేదంటే 1%/M పెనాల్టీ తప్పదు.

News March 15, 2025

విమానంలో వచ్చినా చెట్లను నరికేవారు: చంద్రబాబు

image

AP: గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లారని CM చంద్రబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం సుపరిపాలనతో దూసుకెళ్తోందని చెప్పారు. తణుకులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గత సీఎం జగన్ ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఒక వేళ వచ్చినా పరదాలు కట్టుకుని తిరిగేవారు. విమానంలో వచ్చినా కింద చెట్లను కొట్టేసేవారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడనిచ్చేవారు కాదు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!