News December 17, 2024
రేపు కాంగ్రెస్ చలో రాజ్ భవన్.. పాల్గొననున్న సీఎం

TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై PM మోదీ వైఖరిని నిరసిస్తూ రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని TPCC నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగినప్పటి నుంచి PM అక్కడికి వెళ్లలేదని INC విమర్శిస్తోంది.
Similar News
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
News November 26, 2025
RRR కేసు.. సునీల్ కుమార్కు సిట్ నోటీసులు

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.
News November 26, 2025
నేర నిరూపణకు నల్లుల సాయం

నేర పరిశోధనలో నల్లులు కీలకంగా మారే అవకాశం ఉందని మలేషియా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నల్లులు మనుషుల రక్తాన్ని పీల్చిన తర్వాత అందులోని DNAను సుమారు 45 రోజుల వరకు నిల్వ ఉంచగలవని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా బృందం తెలిపింది. నేరం జరిగిన ప్రాంతాల్లో నల్లులు ఉంటే వీటి నుంచి సమాచారం గుర్తించవచ్చని, సాక్ష్యాలు లేకుండా చేసిన కేసుల్లోనూ ఇవి కీలక ఆధారాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.


