News April 14, 2025
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ బుజ్జగింపు సాధనంగా వాడింది: మోదీ

కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.
Similar News
News April 15, 2025
UPDATE.. కింగ్డమ్ డబ్బింగ్ స్టార్ట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.
News April 15, 2025
రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ పేర్లను చేర్చినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ వీటిలో పాల్గొనాలని పేర్కొంది.
News April 15, 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <