News April 25, 2024

సొంత అభ్యర్థికి ఓటు వేయెుద్దంటున్న కాంగ్రెస్.. ఎందుకంటే?(2/2)

image

అదే సమయంలో దామోర్ తెలిసి తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో విత్‌డ్రా గడువు ముగియడంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. దీంతో స్థానిక నేతలు అంతా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న BAP అభ్యర్థి రాజ్ కుమార్‌కి ఓటెయ్యాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు BAP వ్యతిరేక గళాలను దామోర్ తనకు అనుకూలంగా పోగేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం బీజేపీ‌కి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 1, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు మరో తలనొప్పి..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల రెండు, మూడు మధిర గ్రామాలు ఓ మేజర్ గ్రామ పంచాయతీ కింద కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మేజర్ గ్రామాల నేతలకు, మధిర గ్రామాల నేతలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ గ్రామంలో ఓట్లు ఎక్కువ ఉన్న కులం వారికే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిందని, అందుకే తమ గ్రామంలోని అభ్యర్థులకే ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

News December 1, 2025

రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

image

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.

News December 1, 2025

‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.