News October 8, 2024
₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన: జగదీశ్ రెడ్డి

TG: హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘చెరువులపై చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితేంటో చూద్దాం. ప్రకటించిన లిస్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా? కూల్చివేతలతో ఇప్పటికే ₹1000కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. ₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన’ అని ప్రెస్మీట్లో ఆరోపించారు.
Similar News
News February 1, 2026
పద్దు డిసైడ్ చేసేది వీళ్లే

కేంద్ర బడ్జెట్ వెనుక ఓ పెద్ద టీమ్ వర్కే ఉంటుంది. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధా ఠాకూర్, రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాస్తవ, ఎక్స్పెండిచర్ సెక్రటరీ వి.వుయల్నామ్, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్రటరీ ఆరునిష్ ఛావ్లా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రటరీ కే మోసస్, ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత్ నాగేశ్వరన్ ఈసారి బడ్జెట్లో కీలక పాత్ర పోషించారు.
News February 1, 2026
LIVE: లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మల

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. పైన ఉన్న ప్లే బటన్ నొక్కి LIVE చూడొచ్చు.
News February 1, 2026
‘మహామాఘి’ అంటే తెలుసా?

ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘ పౌర్ణమి అతి పవిత్రమైనది. అందుకే దీనిని ‘మహామాఘి’ అంటారు. ఈరోజున చంద్రుడు మఖ నక్షత్రంతో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది హరిహరులకు ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో దేవతలందరూ గంగానదిలో నివసిస్తారట. అందుకే నేడు చేసే నదీ స్నానం అనంతమైన పుణ్యఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ పర్వదినం మానవాళికి ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్యకరమైన జీవనానికి కావలసిన సంకల్పాన్ని అందిస్తుంది.


