News April 8, 2025
ఏప్రిల్ 7తో కృనాల్కు కనెక్షన్.. విజృంభణే!

వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కృనాల్ పాండ్య నాలుగు వికెట్లతో అదరగొట్టారు. అయితే, గత మూడేళ్లుగా ఏప్రిల్ 7న జరిగే మ్యాచుల్లో కృనాల్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో LSG తరఫున 3 వికెట్లు, 2024లో GTతో మ్యాచులోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. నిన్నటి మ్యాచులోనూ సత్తాచాటారు.
Similar News
News April 17, 2025
ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం

బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఆ పార్టీ అగ్రనేతలు PM మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ అధ్యక్షుడి, పలు రాష్ట్రాలకు చీఫ్లను ఎన్నుకునే ప్రక్రియపై చర్చించినట్లు తెలుస్తోంది. APR 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు, రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు రెండు, మూడ్రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.
News April 17, 2025
పురుషులకు అలర్ట్.. ఈ తప్పు చేయకండి

ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా, మద్యం, సిగరెట్ అలవాట్లు మానేసినా లైంగిక సామర్థ్యం మెరుగుపడటం లేదని చాలామంది పురుషులు బాధపడుతుంటారు. అయితే విటమిన్-D లోపమూ ఇందుకు కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది బోన్స్, రోగ నిరోధక శక్తితో పాటు లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. విటమిన్-డి లెవెల్స్ తగ్గకుండా మెయింటేన్ చేయాలని సూచించింది. పూర్తి వివరాలు ఈ లింక్పై <
News April 17, 2025
ముర్షిదాబాద్ అల్లర్లపై సిట్ ఏర్పాటు

పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు, తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. మరోవైపు అల్లర్లలో మృతి చెందిన ముగ్గురి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున CM మమత నష్టపరిహారం ప్రకటించారు.