News November 28, 2024
ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం: మంత్రి సీతక్క

TG: గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని, త్వరలోనే కుట్రదారులను బయటపెడతామని ప్రకటించారు. ఇందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఇటీవల పలు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Similar News
News February 10, 2026
MBNR: హీటర్ షాక్ కొట్టి యువకుడి మృతి

మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు జామ్ రవి కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. రవి జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో స్నానం చేయడానికి హీటర్ను ఉపయోగిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News February 10, 2026
ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ ఒక్క పాయింట్ చెక్ చేయండి..

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియంతో పాటు ‘క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో’ (CSR) చూడటం చాలా ముఖ్యం. ఒక ఏడాదిలో కంపెనీకి వచ్చిన మొత్తం క్లెయిమ్లలో ఎన్నింటిని పరిష్కరించారో తెలిపే శాతమే ఈ CSR. IRDAI ఏటా ఈ వివరాలను వెల్లడిస్తుంది. సాధారణంగా 95% కంటే ఎక్కువ రేషియో ఉన్న కంపెనీలు నమ్మదగ్గవి. ఆపదలో ఆర్థిక సాయం సకాలంలో అందాలంటే అధిక CSR ఉన్న సంస్థను ఎంచుకోవడం బెటర్.
News February 10, 2026
‘కవిత్వం నేర్చుకుంటా’.. ఆంథ్రోపిక్ ఇంజినీర్ రాజీనామా!

<<19068101>>టెక్ సంచలనం<<>> ‘ఆంథ్రోపిక్’లో ఏఐ సేఫ్టీ ఇంజినీర్ మృణాంక్ శర్మ రాజీనామా కలకలం రేపింది. ‘AI, బయో వెపన్లతోనే కాదు.. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే సంక్షోభాల వల్ల కూడా ప్రపంచం ప్రమాదంలో ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యానికి సమానంగా మన జ్ఞానం పెరిగినట్లుగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. విలువలను కోల్పోతున్నామని, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని రాసుకొచ్చారు. కవిత్వంలో డిగ్రీ చేస్తానని తెలిపారు.


