News September 11, 2024
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

AP: ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు YCP నేతలకు చెందినవేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే కుట్రతోనే బోట్లను ఢీకొట్టేలా చేశారన్నారు. ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ కోసం జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్ వరదలతో కష్టాలు అనుభవిస్తున్న ప్రజల బాధలు పట్టావా అని మండిపడ్డారు.
Similar News
News January 7, 2026
BCCIపై మొయిన్ అలీ పరోక్ష ఆరోపణలు

IPL నుంచి ముస్తాఫిజుర్ను <<18748860>>తప్పించడాన్ని<<>> ENG క్రికెటర్ మొయిన్ అలీ తప్పుబట్టారు. ‘ఎన్నో ఏళ్ల కష్టానికి అతనికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఇలా తప్పించడంతో ఎక్కువగా నష్టం జరిగేది అతడికే. పాలిటిక్స్ క్రికెట్ను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపాలి. ఇలాంటి సమస్యలపై AUS, ENG బోర్డులు ఎందుకు మాట్లాడవు. ICCని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు’ అంటూ BCCIపై పరోక్ష ఆరోపణలు చేశారు.
News January 7, 2026
తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పెరిగిన బంగారం ధరలు కాసేపటి క్రితం తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,38,270కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500 పతనమై రూ.1,26,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,77,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 7, 2026
అంబర్నాథ్ అలయన్స్.. హైకమాండ్స్ ఆగ్రహం

అంబర్నాథ్ (MH) మున్సిపాలిటీలో స్థానిక <<18786772>>BJP-కాంగ్రెస్<<>> కలిసిపోవడంపై ఇరు పార్టీల నాయకత్వాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ప్రాంత పార్టీ చీఫ్ సహా తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఇక లోకల్ BJP నేతల తీరుపై CM దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సీట్ల కౌన్సిల్లో కాంగ్రెస్ 12, BJP-14, NCP (అజిత్)-4 శివసేన (షిండే)-27 పొందగా SSను పక్కనబెట్టి మిగతా పార్టీలు కూటమి ప్రకటించాయి.


