News April 19, 2024
కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఆప్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోర్టులో ఆరోపించింది. ‘డయాబెటిస్తో బాధపడుతున్న ఆయనకు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేమెంత రిక్వెస్ట్ చేసినా అధికారులు తగినంత డోసు ఇన్సులిన్ ఇవ్వడం లేదు’ అని ఆరోపించింది. ఆయనకు తగిన వైద్యం అందేలా చూడాలని కోర్టును కోరింది. కాగా.. కేజ్రీ కావాలనే షుగర్ పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
సర్పంచ్గా మొదలై.. 5 సార్లు MLAగా గుమ్మడి నర్సయ్య

ఖమ్మం(D) సింగరేణి(M) టేకులగూడేనికి చెందిన గుమ్మడి నర్సయ్య రాజకీయాల్లో సుపరిచితం. ఆయన రాజకీయ జీవితం మొదటగా సొంత గ్రామానికి సర్పంచ్గా మొదలైంది. ఆ తర్వాత ఇల్లందు నుంచి CPI ML న్యూడెమోక్రసీ తరఫున ఏకంగా 5 సార్లు MLAగా గెలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిస్వార్థ, నిరాడంబర ప్రజానేతగా పేరుగాంచిన గుమ్మడి నర్సయ్య జీవితం, నేడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిజంగా ఆదర్శనీయం కదూ.
News November 28, 2025
బాపట్ల: ‘జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి’

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే కలెక్టరేట్కు సమాచారం పంపించాలని అన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ భావన అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్


