News April 19, 2024
కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఆప్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోర్టులో ఆరోపించింది. ‘డయాబెటిస్తో బాధపడుతున్న ఆయనకు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేమెంత రిక్వెస్ట్ చేసినా అధికారులు తగినంత డోసు ఇన్సులిన్ ఇవ్వడం లేదు’ అని ఆరోపించింది. ఆయనకు తగిన వైద్యం అందేలా చూడాలని కోర్టును కోరింది. కాగా.. కేజ్రీ కావాలనే షుగర్ పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 14, 2024
కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా
TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18న కేటీఆర్తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లను కోర్టు రికార్డు చేయనుంది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.
News October 14, 2024
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. ప్రధాన నిందితుడు సరెండర్
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, MLC లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. YCP విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ ఇవాళ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు.
News October 14, 2024
క్యాన్సర్ ట్రీట్మెంట్.. కనురెప్పలు కోల్పోయిన నటి
స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్స్ర్తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనా ఖాన్కు కీమో థెరపీ కొనసాగుతోంది. అత్యంత కఠినమైన ఈ చికిత్స సందర్భంగా ఆమె ఇప్పటికే తన జుట్టును కోల్పోయారు. తాజాగా ట్రీట్మెంట్ ఫైనల్ స్టేజ్లో తన కనురెప్పలు కూడా పోయాయంటూ ఆమె అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో ‘మీరొక వారియర్. త్వరలోనే కోలుకుంటారు’ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.