News April 11, 2024

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

image

AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఓ బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీ‌కి హాజరై ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 27, 2025

మరణంలోనూ వీడని స్నేహం

image

కర్ణాటకలో జరిగిన ఘోర <<18664780>>బస్సు ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చనిపోయిన వారిలో నవ్య, మానస అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. మరణంలోనూ వారు కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి రోదించారు. ‘వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే కంచంలో తినేవారు. ఒకేచోట చదువుకున్నారు. ఒకే రకం డ్రెస్సులు వేసుకునే వారు. ఒకేచోట పని చేస్తున్నారు. సెలవని ఇంటికొస్తూ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు’ అని విలపించారు.

News December 27, 2025

యూపీలో 2.89కోట్ల మంది ఓటర్లు తొలగింపు!

image

ఉత్తర్ ప్రదేశ్‌లో SIR గడువు నిన్నటితో ముగియగా DEC 31న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో 15.44కోట్ల మంది ఓటర్లకు గానూ 2.89కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. 31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే JAN 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. FEB 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.

News December 27, 2025

ఆల్కహాల్ కొంచెం తాగినా.. నోటి క్యాన్సర్ ముప్పు!

image

ఆల్కహాల్ కొంచెం తాగినా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా స్టడీలో వెల్లడైంది. మద్యం తీసుకోవడానికి సురక్షితమైన పరిమితి లేదు. ప్రతిరోజూ నిర్దిష్ఠ పరిమితిలో తాగినా ఓరల్ మ్యూకోసల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 50% ఉంటుంది. లోకల్ తయారీ మద్యంతో ఆ ప్రమాదం ఎక్కువ. పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారికి నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ 4రెట్లు ఎక్కువ. భారత్‌లో లక్ష మంది మగవారిలో 15మందికి నోటి క్యాన్సర్ వస్తోంది.