News April 11, 2024

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

image

AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఓ బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీ‌కి హాజరై ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News January 2, 2026

సంక్రాంతికి రైతు భరోసా!

image

TG: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతుభరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’తెలిపింది. SMలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో సర్కార్ ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్లు వెల్లడించింది.

News January 2, 2026

కొత్త వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్: పొన్నం

image

TG: రోడ్ సేఫ్టీ సెస్‌పై మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలపరిచేందుకు రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించాం. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు ఇది వర్తిస్తుంది. టూవీలర్స్‌కు రూ.2వేలు, కార్లలాంటి వాటికి రూ.5 వేలు, హెవీ వెహికల్స్‌కి రూ.10వేలు సెస్ విధిస్తాం’ అని తెలిపారు. APలో దీనిని 10%గా నిర్ణయించి క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

News January 2, 2026

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

image

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. TNలోకి వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్‌ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి.