News December 2, 2024
కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్!

TG: రంగారెడ్డి(D) ఇబ్రహీంపట్నంలో జరిగిన <<14767158>>కానిస్టేబుల్ నాగమణి హత్య<<>>కు ఆస్తి గొడవలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి పేరెంట్స్ లేరు. ఇప్పటికే ఒకసారి వివాహమై విడాకులు అయ్యాయి. వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి పెళ్లి తర్వాత ఆమె తన తమ్ముడు పరమేశ్కు ఇచ్చేసింది. రెండో పెళ్లి తర్వాత భూమిలో వాటా ఇవ్వాలని పరమేశ్ను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆ కోపంతోనే పరమేశ్ ఆమెను చంపినట్లు తెలుస్తోంది.
Similar News
News November 29, 2025
మస్క్ ఆఫర్ను రిజక్ట్ చేసిన చైనా విద్యార్థులు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నుంచి ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ xAI నుంచి వచ్చిన మల్టీ మిలియన్ డాలర్ ఆఫర్ను ఇద్దరు చైనా విద్యార్థులు విలియం చెన్, గువాన్ వాంగ్ తిరస్కరించారు. అత్యంత సామర్థ్యం ఉన్న OpenChat మోడల్ను అభివృద్ధి చేసి వీరు మస్క్ను ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన ఆఫర్ను కాదని స్వయంగా సరికొత్త AIని రూపొందించేందుకు Sapient Intelligenceను స్థాపించి సక్సెస్ అయ్యారు.
News November 29, 2025
అప్పటికల్లా నక్సలిజం అంతం: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్పూర్లో జరిగిన DGP, IGP సదస్సులో మాట్లాడారు. తదుపరి కాన్ఫరెన్స్ జరిగే నాటికి ముందే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఏడేళ్లుగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2014లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 ఉండగా, ప్రస్తుతం 11కి తగ్గినట్లు వెల్లడించారు.
News November 29, 2025
పేదల కోసం అర్ధరాత్రి వరకూ ఉంటా: CJI

తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలకు చోటుండదని.. పేద కక్షిదారులే తన తొలి ప్రాధాన్యత అని CJI సూర్యకాంత్ స్పష్టంచేశారు. తిలక్ సింగ్ డాంగీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత ఆయన స్పందిస్తూ.. “చివరి వరుసలో ఉన్న పేదవారి కోసం నేను ఇక్కడ ఉన్నాను. అవసరమైతే అర్ధరాత్రి వరకూ కోర్టులో కూర్చుంటాను” అని అన్నారు. సంపన్నులు వేసే అనవసర కేసులకు సమయం వృథా చేయబోనని వ్యాఖ్యానించారు.


