News December 2, 2024
కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్!

TG: రంగారెడ్డి(D) ఇబ్రహీంపట్నంలో జరిగిన <<14767158>>కానిస్టేబుల్ నాగమణి హత్య<<>>కు ఆస్తి గొడవలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి పేరెంట్స్ లేరు. ఇప్పటికే ఒకసారి వివాహమై విడాకులు అయ్యాయి. వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి పెళ్లి తర్వాత ఆమె తన తమ్ముడు పరమేశ్కు ఇచ్చేసింది. రెండో పెళ్లి తర్వాత భూమిలో వాటా ఇవ్వాలని పరమేశ్ను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆ కోపంతోనే పరమేశ్ ఆమెను చంపినట్లు తెలుస్తోంది.
Similar News
News December 6, 2025
అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

*విదేశాల్లో ఎకనామిక్స్లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి
News December 6, 2025
నితీశ్ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

బిహార్ CM నితీశ్కుమార్ తనయుడు నిశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్కుమార్ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News December 6, 2025
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: eastgodavari.ap.gov.in


