News January 6, 2025
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

AP: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న.. అనంతపురంలో 8-10వరకు జరగాల్సిన పరీక్షలను 17-20, చిత్తూరులో 8, 9న జరగాల్సిన ఎగ్జామ్స్ను 17, 18 తేదీలకు మార్చినట్లు పేర్కొంది.
Similar News
News November 23, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గింది. గడిచిన 24 గంటలలో వెల్దండ మండలం బొల్లంపల్లిలో 18.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వటవర్లపల్లి 18.4, తెలకపల్లి 18.7, తోటపల్లి 18.8, సిరసనగండ్ల 18.9, అమ్రాబాద్, కొండారెడ్డిపల్లి 19.0, వంకేశ్వర్, ఊర్కొండ 19.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


